రాజమండ్రిలోని దేవీచౌక్ సమీపంలో ఉన్న ప్రతాప్ మొబైల్స్ దుకాణంలో గురువారం మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఏడీఎఫ్ఓ పి. శ్రీనివాస్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని దుకాణ యజమాని శ్రీనివాస్ మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.