చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సమావేశo ( రివ్యూ మీటింగ్) గురువారం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు గోపాలపురంఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో, ఆయా పనుల్లో పారదర్శకత అంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంచనాల కమిటీ ఛైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చిత్తూరు జిల్లాకలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.