రాజమండ్రిలో దంచి కొట్టిన వర్షం

64చూసినవారు
రాజమండ్రి నగరంలో కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న నగర ప్రజలకు బుధవారం ఊరట లభించింది. నగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు జలమయమయ్యాయి. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరి కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు.

సంబంధిత పోస్ట్