కొవ్వూరు పాత టోల్గేట్ వద్ద గురువారం రాత్రి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవ్వూరు పాత టోల్ గెట్ వద్ద గురువారం రాత్రి 9.30 నుంచి తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే విధంగా, రాత్రి సమయాలలో సమస్యత్మక ప్రాoతాలలో పటిష్ట గస్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మినీ గూడ్స్ వ్యాన్లు, కార్లు, పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పట్టణ ఎస్సై నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.