రాజమండ్రిలో నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ పనులను మాజీ ఎంపీ మురళీమోహన్, ప్రస్తుతం ఎంపీ పురందేశ్వరితో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ పనులపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.