నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్ కి ఆర్టీసీ నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి - జంగారెడ్డిగూడెం- ఖమ్మం, మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే. వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4, 30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్ ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.