రాజమండ్రి నగరం కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నందు శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు వాహన చోదకులను నిలుపుదల చేసి హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సీఐ బాలశౌరి చోదకులకు హెల్మెట్ వాడకం దాన్ని ప్రాముఖ్యత తెలియజేసి అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం త్రి బుల్ రైడింగ్ చేయరాదని, వాహనాలు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, నెంబర్ ప్లేట్ కనిపించేలా కలిగి ఉండాలని అన్నారు.