రాజమండ్రి: 11న తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

83చూసినవారు
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రాజమండ్రిలోని రౌతు తాతలు కళ్యాణ మండపం వద్ద జైన్ సేవ సమితి ఆధ్వర్యంలో మే 11వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడం ఒక గొప్ప మానవతావాద చర్య అన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కోసం పాటుపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్