గురువారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ ప్రశాంతి ఇండియన్ రెడ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్నారు. 2023-23లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో ఇండియన్ సొసైటీ కార్యకలాపాలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపు ఆమెకు ఈ అవార్డు దక్కింది.