రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్గర్ పరిశీలించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు, రామాలయం సెంటర్, జెఎన్ రోడ్డు, ప్రాంతాలలో పర్యటించి చెత్త సేకరణ పాయింట్లు, చెత్త తరలించే ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజీలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.