రాజమండ్రిలో ఆవ పరిసర ప్రాంతాల్లో 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూకబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఈ స్థలన్నీ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రిలో ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. సొంత ఇళ్ల స్థలాలు లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారన్నారు.