అసెంబ్లీలో 30 వేల ఎకరాల రాజధాని మాటిచ్చిన జగన్, అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం రాజమండ్రిలో విమర్శించారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, సాక్షి డిబేట్లో పాల్గొన్న కొమ్మినేని, కృష్ణంరాజును శిక్షించాలన్నారు. జగన్, భారతి రెడ్డి క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు.