రాజమహేంద్రవరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూకబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఈ స్థలాన్నీ అర్హులైన పేదలకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సీపీఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి సుమారు నాలుగు వేల మంది అర్జిదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల గమేళా ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు.