రాజమండ్రి: త్రివిధ దళాల మెరుపు దాడి అమోఘం

56చూసినవారు
రాజమండ్రి: త్రివిధ దళాల మెరుపు దాడి అమోఘం
మే 7వ తేదీన త్రివిధ దళాల ఆధ్వర్యంలో భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేయడాన్ని సీపీఐ అభినందిస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్య అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్