రాజమండ్రి: ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలి

71చూసినవారు
రాజమండ్రి: ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలి
పహల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి, మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు టి. రమణమ్మ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్