రాజమండ్రి నగరంలో పగలంతా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో సాయంత్రం అయ్యేసరికి చిన్నారులు, పెద్దలు సేద తీరడానికి గోదావరి చెంతన ఆశ్రయిస్తున్నారు. శనివారం రాత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆనo కళా కేంద్రం ఓపెన్ ఆడిటోరియంలో 7 గంటలకు సోలో సినిమా ప్రదర్శించారు. దీంతో ప్రజలు గోదావరి ఒడ్డున ఓపెన్ ప్రాంతంలో గోదావరి అలల చల్లటి గాలుల నడుమ తండోపతండాలుగా వచ్చి వీక్షిస్తున్నారు.