భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రామ్నాథ్ కోవింద్తో పురందేశ్వరి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.