ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్కెవీటీ కళాశాల అభివృద్ధికి పీఎం ఉజ్వల్ పథకం ద్వారా రూ. 5 కోట్లు మంజూరు చేయించడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపల్ రమణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ కుమార్, పీవీబీ సంజీవరావు పాల్గొన్నారు.