రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రాజమండ్రిలో 'సుపరిపాలనకు ఏడాది వేడుకలు' నిర్వహించారు. లోటు బడ్జెట్ ఉన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు నేడు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు.