దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదక్షతతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను, అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. జవాన్ మురళీ నాయక్ వీర మరణం కలచివేసిందన్నారు.