ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేయలేదు. ఇది క్షమించరాని విషయం. టీటీడీ ఛైర్మన్, ఈవో, ఏఈవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేనిపక్షంలో నేను కోర్టులో పిల్ వేస్తా అని ఆయన హెచ్చరించారు.