రాజమండ్రి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన మారిన వాసుదేవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గురువారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలుపుకు కృషి చేసిన ఆయనకు ఏఎంసీ చైర్మన్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.