కడియంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో వైసీపీ నాయకుడు గిరజాల బాబు నిర్మించుకున్న కార్యాలయాన్ని శనివారం అధికారులు కూల్చివేసారు. పక్కనే కట్టబోయే రైతు బజారుకు సంబంధించిన సిమెంటు ఇతర మెటీరియల్ పెట్టుకోవడానికి ఈ షెడ్డు నిర్మించినట్లు గిరజాల తెలుపుతున్నారు. కానీ కాంట్రాక్టర్ తాము ఎలాంటి కట్టడం చేపట్టలేదని మాకు ఆ షెడ్డుకు సంబంధం లేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు.