రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఆదివారం 2500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 500, 500, 1500 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తామన్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద 10. 90 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందన్నారు. 3, 197 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు.