కడియం మండలంలో ఆరుగురు సచివాలయ గ్రేడ్-6 కార్యదర్శులు (డిజిటల్ అసిస్టెంట్) లకు గ్రేడ్ 5 కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారిని కడియం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, వైస్ ఎంపిపి పంతం గణపతి తదితరులు శుక్రవారం అభినందించారు. మండలానికి సుదీర్ఘ కాలంగా వారు అందించిన సేవలు మరువలేవని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదోన్నతులు పొందాలన్నారు.