ఈనెల 11వ తేదీన కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయితీ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.