కడియం మండలంలోని మురమండ 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈ దాట్ల శ్రీధర్ వర్మ గురువారం తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మురమండ, దుళ్ల, పొట్టిలంక, మాధవరాయుడు పాలెం, మెహెర్ గాయత్రీ తదితర ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలన్నారు.