కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన భారీ వర్షం వల్ల తాము నిండా మునిగిపోయామని రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నత అధికారులకి ఆదేశాలు జారీ చేసి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా రైతులు కోరారు.