ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తల నిమిత్తం కడియం మండలంలో గల వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్ర సూపరింటెండెంట్ డా. జి. మాధురి మాట్లాడారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆరోగ్య రీత్యా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వైద్య సిబ్బంది అందుబాటులోను, అప్రమత్తంగాను ఉండాలని, అత్యవసర ప్రాధమిక వైద్య సేవలు అందించాలని తెలిపారు.