మెగాస్టార్ చిరంజీవి, నటి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం రాత్రి రాజమండ్రిలోని ఊర్వశి థియేటర్ వద్ద ప్రదర్శించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు మెగా అభిమానులు భారీగా విచ్చేశారు. దీంతో థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాగా కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది.