తూ. గో జిల్లాలో రబీ 2024 -2025 సీజన్లో ధాన్యం సేకరణ 3. 30 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగా అంచనా వేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శుక్రవారం తెలిపారు. మే 9వ తేదీ నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 39, 856 లు (ఎఫ్టివో) కూపన్లను జనరేట్ చేయుట జరిగినదన్నారు. అలాగే 24, 798 మంది రైతుల నుండి 2, 86, 684, 840 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసామన్నారు.