రాజమండ్రిలోని లలితా నగర్కు చెందిన కోలా శ్రీనివాసరావు (60) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా స్థానిక టి. నగర్లో నెల్లూరు మెస్ నిర్వహిస్తున్న ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మెస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్సుందర్ తెలిపారు.