రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రం నందు పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో 'రజక ఆకాంక్ష సభ' ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రజక సేవా సంఘం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.