గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు 2024-25 రబీ సీజన్లో 8, 96, 507 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీటి అవసరాలకు సంబంధించి డిసెంబర్ 1న నీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరిలో నదిలో 91. 35 టిఎంసిల నీరు అందుబాటులో ఉందన్నారు.