రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజ్ నుంచి బుధవారం సాయంత్రం 52, 546 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్ద 10. 65 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గానూ 85 గేట్లను పైకి లేపి మిగులు జలాలను విడుదల చేసినట్లు తెలిపారు.