తనకు దొరికిన విలువైన సెల్ ఫోన్ ను వేమగిరి గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రమేష్ కడియం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే. తీపర్రు గ్రామానికి చెందిన కందుల పల్లవి అనే మహిళ మంగళవారం రాజమండ్రి వచ్చారు. మార్గం మధ్యలో వేమగిరి వద్ద రూ. 65 వేల విలువైన తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు. ఈ ఫోన్ వెంకట రమేష్ కు దొరికింది. దానిని కడియం సీఐ బి. తులసీధర్ సమక్షంలో బాధిత మహిళకు అందజేశారు.