కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తో కలిసి శనివారం రాత్రి పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతులను కలిసి వారితో ముచ్చటించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.