మిర్తిపాడు గ్రామంలో టీడీపీ నాయకులు నున్న రామారావు గురువారం మృతి చెందారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఎన్నికల సమయంలో అబ్సర్వర్ గా పనిచేశారు. వీరి మృతి పట్ల రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్, రుడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గం పరిశీలకుడు ఆశీష్, టీడీపీ జెండా కప్పి నివాళిలర్పించారు.