రాజానగరం: విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

68చూసినవారు
రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుతో మండలంలోని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నన్నయ విసి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్