సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపులో అధిక ధరలకు ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శుక్రవారం జేసీ చిన్న రాముడు ర్యాంపు సందర్శించి నిర్వాహక సిబ్బందిని విచారించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక అమ్మకాలు జరపాలని సూచించారు. లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.