సీతానగరం మండలంలోని బొబ్బిలిలంక గ్రామంలో ఉన్న లక్ష్మీ గణపతి స్వామి వారిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.