సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపు శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, స్థానికుల పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కాగా ఈ ర్యాంపులో ఇసుక తవ్వకాలకు అక్టోబర్ 15 వరకు అనుమతులు లేనట్లు సమాచారం.