రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ అన్నదాన ట్రస్ట్ కు భక్తులు లక్ష రూపాయలు విరాళాన్ని అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. విశాఖపట్నం వాస్తవ్యులు ఇమంద శ్రీనివాసరావు పద్మలత దంపతులు శనివారం స్వామివారిని దర్శించుకుని అన్నదాన ట్రస్ట్ కు విరాళాన్ని అందజేసినట్లు చెప్పారు.