ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ లో శనివారం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఇతర అధికారులు ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు.