రామచంద్రపురం పట్టణంలోని వీఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 20వ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు.