రామచంద్రపురం పట్టణంలో గల ప్రభుత్వ ఎస్సి బాలుర వసతి గృహన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పరిశీలించారు. సంక్షేమ హాస్టల్లో అసౌకర్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రికార్డ్లను తనిఖీ చేసి విద్యార్థుల వసతి సదుపాయాలను మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు ఆరా తీసి అక్కడ ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.