రామచంద్రపురం నియోజవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అనారోగ్య కారణాల చేత ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 22. 92 లక్షల రూపాయల చెక్కులను మంత్రి సుభాష్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కుందూరు, కె. గంగవరం, బట్లపాలిక, కాజులూరు, రామచంద్రపురం తదితర గ్రామాల వారికీ మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అందజేశారు.