విద్యుత్తు పునరుద్ధరణ త్వరితగతిన జరగాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల ఆకస్మిక వర్షం, పెను గాలుల కారణంగా రామచంద్రాపురం నియోజక వర్గం గంగవరం మండలలో కూలిపోయిన132 కేవీ కరెంట్ టవర్ ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి రాత్రికి టవర్ పునఃనిర్మాణ పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.