ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి హక్కుల దినోత్సవ గౌరవ సూచికగా ఆ రోజుని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం ని బుధవారం ఆదివాసి ప్రతినిధి బృందం కలిసి విన్నవించింది. వినతి పత్రం అందించిన వారిలో ఆదివాసి ప్రతినిధులు బేటి ముత్తయ్య, ఉయిక రాంప్రసాద్, తుష్టి జోగారావు, కుంజా అనిల్, మడివి రవితేజ, మచ్చ వినయ్, చిచ్చడి రాము తదితరులు ఉన్నారు.