గల్ఫ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ సూచించారు. గ్యాస్ కంపెనీ రోడ్లో ఉన్న నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం గల్ఫ్ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ సంస్థ ఛైర్పర్సన్ లిస్సి జోషఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో శ్రీనివాస్ మాట్లాడుతూ. ఎక్కువ మంది కోనసీమ ప్రజలు అవగాహన లేక ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారని అన్నారు.